లారీ డ్రైవర్లకు ఆహారం అందజేసిన జనసేన

తుఫాను ప్రభావంతో నెల్లూరు జిల్లా గూడూరు నేషనల్ హైవేపై రాకపోకలకు తీవ్ర అంతరాయం కలగడంతో లారీ డ్రైవర్లు, ప్రయాణీకులు ఆకలితో అలమటిస్తున్నారు. వారి ఆకలి తీర్చడానికి జనసేన పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు తీగల చంద్ర ఆధ్వర్యంలో జనసైనికులు ఆది శంకర ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి వరగలి క్రాస్ రోడ్డు వరకు 600 భోజనాల ప్యాకెట్లను, వాటర్ ప్యాకెట్లను ప్రయాణీకులకు అందజేసి వారి ఆకలి తీర్చారు. ఈ కార్యక్రమంలో రాజన్న, సాయి, మోహన్, శంకర్, శివ, పెంచలయ్య, భరత్ తదితర జనసైనికులు పాల్గొన్నారు. ఆహారం అందజేసిన జనసైనికులకు లారీ డ్రైవర్లు కృతజ్ఞతలు తెలిపారు.