సురాజ్య స్థాపనే జనసేన ధ్యేయం.. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లొ మత్స.పుండరీకం
పార్వతీపురం మన్యం జిల్లా, పాలకొండ నియోజకవర్గఒ, వీరఘట్టం మండలం, నడుకూరు గ్రామంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో 75 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఇ సందర్భంగా జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుడు మత్స.పుండరీకం మాటలాడుతు నా దేశం అమరభారతం మనిషిలోని మూర్ఖత్వన్ని రూపుమాపి, దైవత్వన్ని నింపి మనిషిని పునరుజ్జీవింపజేసే అద్భుత శక్తి భారతదేశానికి సొంతం. వివేకానంద ని దేశభక్తి, భగత్ సింగ్ ఆత్మశక్తి, గాంధీజీ ఆశయస్ఫూర్తి.. మరెఒదరో స్వాతంత్ర్య కోసం పోరాడిన స్వరాజ్య సమరయోధులు కలలు నిజం చేసి సురాజ్య స్థాపనే ధ్యేయంగా జనసేన పార్టీ పనిచేస్తుంది అని, స్వరాజ్య సాధన ఆనాటి సమరయోధుల ఘనత – సూరాజ్య స్థాపన ఈనాటి స్వతంత్ర భారత పౌరుల బాధ్యత అని, అదేవిధంగా డబ్భై ఐదువ స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా భారతదేశం సాంఘిటిత ఆత్మ కి నిదర్శనం *హార్ ఘర్ తీరంగా – ఆజాధీ కా అమృత్ మహోత్సవ్ అని మత్స.పుండరీకం అన్నారు.
చింత గోవర్ధన్ మాటలాడుతూ ఆనాటి త్యాగమూర్తులు కలలుగన్న భవ్యభారత్ నిర్మాణానికి యువత పిడికిలి బిగిచాలని, దేశ రక్షణ, భద్రత, పురోగతి, శ్రేయస్సు శక్తి వంచన లేకుండా యువశక్తి కృషి చేయాలన్నారు. ఇ కార్యక్రమంలో కలిపిల్లి సింహ చలం, కంటు రాంబాబు, వాన పవన్, కర్నేన సాయి పవన్,బి.పి.నాయుడు తదితరులు పాల్గొన్నారు.