పౌరుని నైతిక అభివృద్ధే నిజమైన దేశాభివృద్ధి: దాసరి రాజు
ఇచ్చాపురం, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 131 వ జయంతి పురస్కరించుకొని ఇచ్చాపురం బస్టాండ్ అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించిన ఇచ్చాపురం జనసేన సమన్వయకర్త దాసరి రాజు మాట్లాడుతూ దేశం అభివృద్ధి చెందడమంటే అద్దాల మేడలు రంగుల గోడలు కాదు పౌరుని నైతిక అభివృద్ధే నిజమైన దేశాభివృద్ధి చెప్పిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అడుగుజాడల్లో ప్రతి ఒక్క భారతీయులు ముందుకు పోవాలని కొనియాడారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి అప్పుడు మున్సిపాలిటీ వార్డ్ ఇంచార్జ్ రొక్కల భాస్కర్ సంతోష్ మహారణా దాసరి శేఖర్ మరియు దుంగ భాస్కర్ కుమార్ మేఘనాథ్ బిజెపి నాయకులు ఎర్రయ్య కిషోర్ తదితరులు పాల్గొన్నారు.