కాపు ఉద్యమానికి స్వస్తి పలికిన ముద్రగడ

కాపులకు బీసీ రిజర్వేషన్లు సాధించేందుకు చేపట్టిన ఉద్యమం నుంచి పక్కకు తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ప్రకటించారు. సోషల్‌ మీడియాలో తనపై వస్తున్న విమర్శలకు  కలత చెంది ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు కాపులను ఉద్దేశించి సోమవారం సుదీర్ఘ లేఖ రాశారు

‘ఈ మద్య పెద్దవారు చాలామంది మన సోదరులతో నేను మానసికంగా కుంగిపోయే విధంగా సోషల్‌ మీడియా, ఎలక్ట్రానిక్‌ మీడియా ద్వారా దాడులు చేయిస్తున్నారు.  నేను ఆ రోజు ఉద్యమంలోకి రావడానికి కారణం.. చంద్రబాబే. గతంలో ఆయన కాపులకు రిజర్వేషన్లు ఇస్తామన్నారు. మన జాతికి బీసీ రిజర్వేషన్‌ ఇస్తానన్న హామీ అమలు కోసం ఉద్యమాన్ని మొదలు పెట్టాను. ఈ ఉద్యమం ద్వారా డబ్బు, పదవులు పొందాలని ఏనాడూ అనుకోలేదు.’ నాపై విమర్శలు చేసేవాళ్లు డ్రైవర్‌ సీటులో కూర్చుని.. కాపులకు బీసీ రిజర్వేషన్లు తీసుకురావాలి’’అని సోమవారం ఆయన బహిరంగ లేఖ రాశారు.