ముఖ్యమంత్రి మాటలను లెక్కచేయని అధికారులు అనకాపల్లి అధికారులు

అనకాపల్లి, ముఖ్యమంత్రి మాటలను కూడా లెక్కచేయటం లేదని జనసేన నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం అనకాపల్లి రోడ్ల దుస్థితిపై జనసేన ఆధ్వర్యంలో ఆందోళన జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనకాపల్లి రోడ్లు నరక కుపాలుగా తయారయ్యాయి అన్నారు. అనకాపల్లి అందాలపల్లిగా తీర్చిదిద్దుతామని చెప్పిన మాటలు నీటి మూటలుగా మారాయి అన్నారు శంకరం సుంకరమెట్ట రోడ్లు గుంతలపల్లిగా అనేందుకు అవకాశం కల్పిస్తున్నాయన్నారు. దీనికి అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని చెప్పారు. మోకాళ్ళ లోతు గుంతలు ఉన్న నగరం ఎక్కడా లేదన్నారు వాహనదారులు. పడుతున్న ఇబ్బందులు అధికారులకు పాలకులకు పట్టకపోవడం దురదృష్టకరమన్నారు. ఇప్పటికైనా అధికారులు పట్టించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీం జనసేన నాయకలు పాల్గొన్నారు. తాడి రామకృష్ణ, రాందాస్ గోవిందా, మల్ల శ్రీను, దూలం గోపి, గల్ల కొండలరావు, శ్రీకాంత్, రాము, గొల్లవిల్లి రాజు, పీజే, వంశీ, సాయి, దుర్గా ప్రసాద్, త్రినాధ్ తదితరులు పాల్గొన్నారు.