పెగాసస్‌ వ్యవహారం.. సుప్రీం కీలక ఆదేశాలు

పెగాసస్‌ వ్యవహారంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. పిటిషనర్‌ వాదనల నేపథ్యంలో అత్యున్నత ధర్మాసనం దీనిపై విచారణకు ఆదేశిస్తూ.. నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. సుప్రీంకోర్టు రిటైర్‌ జడ్జి నేతృత్వంలో నిపుణుల కమిటిని నియమించింది. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో జస్టిస్‌ ఆర్వీ రవీంద్రన్‌ నేతృత్వంలో త్రిసభ్య కమిటీ నియమించింది. చట్టబద్ధ పాలన సాగాలన్నదే తమ అభిమతం అని సుప్రీంకోర్టు పేర్కొంది. ప్రాథమిక హక్కుల ఉల్లంఘనను కోర్టు సహించదని సుప్రీంకోర్టు తెలిపింది. ఈ కేసులో కొందరు పిటిషనర్లు పెగాసస్‌ ప్రత్యక్ష బాధితులని పేర్కొంది. సాంకేతిక పరిజ్ఞానం ద్వురినియోగంపై పరిశీలన చేస్తామని సుప్రీంకోర్టు తెలిపింది.