కృష్ణాపురం గ్రామంలో కాలువలు లేని దుస్థితి

శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం కృష్ణాపురం పంచాయతీ కృష్ణాపురం గ్రామంలో కెల్లవీది దగ్గర కుళాయి నీరు ఏమార్గం ద్వారా వెళ్లాలో తెలియని పరిస్థితిలో ఉంది. కుళాయి నీరు ఎవరికి పనికి రాకుండా వృధా అవుతుంది. ప్రభుత్వుం నుండి వచ్చిన నిధులు ఏమౌతున్నాయో తెలియదు కాని కృష్ణాపురం ప్రజలు కాలువలు లేక నీరుకి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నీరు ఎక్కడకి అక్కడే నిల్వ అవుతుంది. వైయస్సార్ పార్టీ నాయకులు పట్టించుకునే వారే లేరు ఓట్లు కోసం ఎగబడి వస్తున్నారు. ఈసారి ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. జనసేన పార్టీ తరుపున పోట్నూరు లక్ష్మునాయుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ కాలువలు మరియు నీరు తక్షణమే వృధా కాకుండా చేస్తే మంచిది లేకపోతే జనసేన పార్టీ తరపున గ్రామంలో సెక్రెటరీ కి మండలం డెవలప్ మెంట్ ఆఫీసర్ కి జిల్లా కలెక్టర్ కి కమిషనర్ ఆర్ టి ఐ కి సమాచారం హక్కు చట్టం ప్రకారం సెక్షన్ 6(1) ప్రకారం అర్జీలు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వానికి వారం రోజులు గడువు ఇవ్వడం జరుగుతుంది. వెంటనే పరిష్కరించాలని జనసేన నాయకులు కృష్ణాపురం పంచాయతీ యంపీటీసీ అభ్యర్థి పోట్నూరులక్ష్మునాయుడు, సర్పంచ్ అభ్యర్థి నడుపూరు శంకర్రావు, కృష్ణాపురం యువనాయకుడు మరియు లింగాల సూరిబాబు ప్రభుత్వం పై డిమాండ్ చేశారు.