వైసీపీ దూరాగతాలపై జనసేన, టీడీపీ శ్రేణులు బలంగా పోరాడాలి

  • వైసీపీ ప్రజా కంఠక పాలన నుంచి రాష్ట్రాన్ని విముక్తి చేయటమే అందరి లక్ష్యం కావాలి
  • ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదురుకునేందుకు సిద్ధంగా ఉండాలి
  • టీడీపీ జనసేన శ్రేణులకు దిశానిర్దేశం చేసిన జనసేన పార్టీ పీ ఏ సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్

గుంటూరు: వైసీపీ దురాగతలపై జనసేన టీడీపీ బలంగా పోరాడాలని జనసేన పార్టీ పీ ఏ సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. జిల్లా అధికార ప్రతినిధి ఆళ్ళ హరి ఆధ్వర్యంలో శనివారం ఆయన పార్టీ కార్యాలయంలో టీడీపీ, జనసేన పార్టీ కార్యకర్తలను కలిసి మాట్లాడారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ ఇరు పార్టీ శ్రేణులు క్షేత్రస్థాయిలో కలిసి ముందుకు సాగాలన్నారు. తమ దాష్టీకాలను ప్రశ్నించే గొంతుకలను వైసీపీ అణచివేయటం హేయమన్నారు. వైసీపీ నియంతృత్వ ధోరణిపై ప్రజల్లో సైతం అగ్రహజ్వాలాలు పెల్లుబికుతున్నాయని పేర్కొన్నారు. వైసీపీ ప్రజా కంఠక పాలన నుంచి రాష్ట్రాన్ని విముక్తి చేయటమే అందరి లక్ష్యం కావాలన్నారు. నిత్యం ప్రజలతో మమేకమవుతూతూ వారికి మేమున్నాం అన్న భరోసాను ఇవ్వాలన్నారు. ఎన్నికలు అతి సమీపంలోనే ఉన్నాయన్నారు. ఎవరూ కూడా ఏమరుపాటుగా ఉండొద్దన్నారు. మూడు నెలల్లో రాష్ట్రంలో రాజకీయంగా పెనుమార్పులు రానున్నాయని. మంచి పాలకుల చేతుల్లోకి రాష్ట్రం వెళ్లనుందన్నారు. మనోహర్ ని కలిసిన వారిలో టీడీపీ యస్సి సెల్ నాయకుడు లక్ష్మణ్ బాషా, కృష్ణ కౌండిన్య, సయ్యద్ షర్ఫుద్దీన్, చిన్ని రాజేష్, నిస్సంకరరావు అనసూయ, గుర్రాల ఉమ తదితరులు పాల్గొన్నారు.