డాక్టర్ పిల్లా దీపిక శ్రీధర్ ఆధ్వర్యంలో ఆవిర్భావ సభకు తరలి వెళ్ళిన పిఠాపురం జనసేన శ్రేణులు

పిఠాపురం: జనసేన పార్టీ 10వ ఆవిర్భావ సభ సందర్భంగా చలో మచిలీపట్నం సభా వేదికకు పిఠాపురం నియోజకవర్గం నుంచి జనసేన నాయకులు డాక్టర్ పిల్లా దీపిక శ్రీధర్ ల ఆధ్వర్యంలో భారీ ఎత్తున 15 బస్సులు, 6 కార్ లు, 800 మంది జనసైనికులతో భారీ ఎత్తున చలో మచిలీపట్నం నుండి జనసైనికులు, వీరమహిళలు, జనసేన నాయకులు భారీ ఎత్తున తరలి వెళ్ళడం జరిగింది. ఈ కార్యక్రమానికి బస్సులను డాక్టర్ పిల్లా దీపిక శ్రీధర్ చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. అనంతరం డాక్టర్ పిల్లా దీపిక శ్రీధర్ మీడియాతో మాట్లాడుతూ జనసేన పార్టీ 10వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు మచిలీపట్నంలో నిర్వహిస్తున్న జనసేన పార్టీ ఆవిర్భావ సభకు పిఠాపురం నియోజకవర్గం నుండి జనసేన కార్యకర్తలు, వీరమహిళలు, భారీ ఎత్తున బస్సుల్లో బయలుదేరి వెలుతున్నట్లు తెలిపారు. పేద ప్రజలకు న్యాయం జరగాలన్న రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా పవన్ కళ్యాణ్ గారు లాంటి మంచి వ్యక్తులు ముఖ్యమంత్రి కావాలని 2024లో పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవ్వడం ఖాయమని డాక్టర్ పిల్లా దీపిక శ్రీధర్ అన్నారు.