జనసేనాని బాటలో గురుదత్

శ్రీరంగపట్నం గ్రామంలో పలువురిని పరామర్శించిన గురుదత్

రాజానగరం నియోజకవర్గం, కోరుకొండ మండలం, శ్రీరంగపట్నం గ్రామానికి చెందిన గొల్లకోటి నరసింహమూర్తి భార్య పద్మావతికి కాలుకి శస్త్రచికిత్స జరిగింది. విషయం తెలుసుకున్న రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ & ఐక్యరాజ్యసమితి అవార్డు గ్రహీత మేడ గురుదత్ ప్రసాద్ శుక్రవారం వారి కుటుంబాన్ని పరామర్శించి, జనసేన పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని తెలిపారు. తదనంతరం శ్రీరంగపట్నం గ్రామానికి చెందిన పక్షవాతానికి గురైన చిక్కిరెడ్డి నారాయణరావు ను
గురుదత్ ప్రసాద్ పరామర్శించి, ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో కోరుకొండ మండల జనసేన పార్టీ అధ్యక్షులు మండపాక శ్రీను, అత్తిలి శ్రీరామచంద్రమూర్తి, అత్తిలి ప్రసాదం, కనుమూరు చంద్రయ్య దొర, తన్నీరు తాతాజీ, అడపా అంజిబాబు, కోరుకొండ మండల జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి జాన్ ప్రసాద్, గొల్లకోటి కృష్ణ, చదువు ముక్తేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.