భారత్ చేరుకున్న రెండో బ్యాచ్ రఫేల్ యుద్ధ విమానాలు

ఫ్రాన్స్‌ నుంచి మూడు రాఫెల్‌ యుద్ధ విమానాలు బుధవారం రాత్రికి భారత్‌ చేరుకున్నాయి. ఇప్పటికే మొదటి శలో పలు రపేల్ యుద్ధ విమానాలు భారతదేశానికి చేరుకున్న విషయం తెలిసిందే. తాజాగా, రెండవ బ్యాచ్ రాఫెల్ ఫైట్ జెట్స్ ఫ్రాన్స్ నుంచి నాన్-స్టాప్ ఎగురుతూ వచ్చాయి. రెండో బ్యాచ్‌లో భాగంగా ఫ్రాన్స్ నుంచి బయల్దేరిన ఈ విమానాలు భారత్‌కు చేరుకున్నాయి. ఫ్రాన్స్ నుంచి భారత్‌కు ఎక్కడా ఆగకుండా రావడం గమనార్హం. జెట్స్ ఫ్రాన్స్ నుంచి నాన్-స్టాప్ ఎగురుతూ 7000-బేసి కిలోమీటర్లను కవర్ చేశాయని ఐఏఎఫ్ పోస్ట్ చేసింది. ఈ అత్యాధుక యుద్ధ విమానాలు అంబాలలోని వైమానిక స్థావరంలో దిగినట్లు భారత వైమానిక దళం ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. జులై 29న ఐదు రఫేల్ జెట్లు భారత్ కు రాగా, భారతదేశంలో బుధవారం రాత్రి 8.14 గంటలకు మరో మూడు జెట్లు చేరుకున్నాయి. 2023 నాటికి మొత్తం విమానాలు భారత్‌కు చేరతాయని తెలిపారు.