ఎన్నారై ల సేవలు ప్రశంసనీయం

వృత్తి రీత్యా విదేశాల్లో కుటుంబాలకు దూరంగా ఉంటూ పుట్టిన ఊరూ కోసం నమ్మిన నాయకుడి కోసం పరితపించే నిస్వార్థ జనసైనికులు ఈ ఎన్నారై లు తాము దూరంగా ఉండిపోయాం కనీసం మా జనసైనికులు, వీర మహిళలు, నాయకులు అయినా ఆవిర్భావ దినోత్సవం కార్యక్రమానికి వెళ్ళాలి అని పెద్ద మనసుతో సముచితమైన ఆలోచన చేసి ఆచరణలో పెట్టిన దేశ భక్తులు ఈ జనసైనికులు. ఎన్నారై అనిశెట్టి స్వామి, సప్తగిరిష్, సాయి నండూరి ల ఆద్వర్యంలో రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న జనసైనికులను సభా ప్రాంగానికి తీసుకు వచ్చి క్షేమంగా ఇళ్లకు చేరే వరకు ప్రతి క్షణం తగిన జాగ్రత్తలు తీసుకున్న వైనం శ్లాఘనీయం. ఎన్నారైలు జనసేన ఆవిర్భావ సభకు 61 బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. యూ.ఎస్.ఏ ఎన్నారై టీం సభ్యులు చేసిన సేవలకు రెండు తెలుగు రాష్ట్రాలలో జనసేన పార్టీ నాయకులు, నియోజకవర్గ ఇంఛార్జిలు, మరియు జనసైనికులు, వీర మహిళలు హర్షం వ్యక్తం చేశారు.