జనసేనలో చేరిన ఆరుగులను వైసీపీ నేతలు

తాడేపల్లిగూడెం: కూటమి ప్రభుత్వం ద్వారానే గ్రామ స్వరాజ్యం సాధ్యమని కూటమి అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. బుధవారం ఆరుగొలను గ్రామానికి చెందిన అడపా సూరిబాబు నార్నికార్తీక్ అడప వాసు, రూరల్ మండలం అధ్యక్షుడు అడప ప్రసాద్ ఆధ్వర్యంలో పలువురు వైసిపి నేతలు బొలిశెట్టి నివాసంలో జనసేన పార్టీలో చేరారు. వేరిని కూటమి అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ జనసేన పార్టీ కండువాలు వేసి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు. గ్రామపంచాయతీ నిధులను దారిమల్లించి పంచాయతీల్లో అభివృద్ధి వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని గ్రామానికి సేవ చేద్దామన్న స్థానిక నాయకుల తీర్చుకోలేని స్థితిలో పార్టీని వీడుతున్నారన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక గ్రామాభివృద్ధి ద్యేయంగా ముందుకు వెళ్తామన్నారు.