రాష్ట్రానికి మూడో ప్రత్యామ్నాయంగా జనసేనను గెలిపించండి: గునుకుల కిషోర్

నెల్లూరు: రాష్ట్రానికి మూడో ప్రత్యామ్నాయం కావాలని సుధీర్ఘ అనుభవం గల రాజకీయవేత్తలే సూచిస్తున్నారని అందుకు అన్ని విధాల అర్హతలు కలిగిన పార్టీ జనసేన పార్టీ, రాష్ట్ర ప్రజలందరూ ఆలోచించి జనసేనను గెలిపించాలి అంటూ.. జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ ఆధ్వర్యంలో పదవ డివిజన్ స్థానిక జనసేన కార్యకర్త హేమచంద్ర యాదవ్ ఇంటి వద్ద జనసేన పార్టీ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు రెండు పార్టీలకు అవకాశం ఇచ్చి మోసపోయారు, ఇబ్బందులకు గురి అవుతున్నారు. మూడవ ప్రత్యామ్నాయం ఎదగాల్సిన అవసరం ఉందని సమాజ శ్రేయస్సును కాంక్షించే సుదీర్ఘ ఆలోచనలు కలిగిన పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర అభివృద్ధికి అన్ని విధాలుగా తగిన వ్యక్తి. ఒకసారి అవకాశం ఇచ్చి జనసేన పార్టీని గాజు గ్లాసు కు ఓటు వేసి గెలిపించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని తెలియజేశారు. పాతిక సంవత్సరాల మన బిడ్డల బంగారు భవిష్యత్తుకు, రాష్ట్ర ప్రగతి కై అడుగులు వేస్తున్న పవన్ కళ్యాణ్ ని ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గురుకుల కిషోర్ తో పాటు హేమ చంద్రయాదవ్, కంతర్, అమీన్, ప్రశాంత్ గౌడ్, మౌనిష్, హరి, షాజహాన్, ప్రసన్న, చిన్న రాజా, ఇంతియాజ్, తదితరులు పాల్గొన్నారు.