ఘనంగా కార్వేటినగర మండల కమిటీ సభ్యుల పదవి ప్రమాణస్వీకారోత్సవం

జి.డి నెల్లూరు నియోజవర్గం, కార్వేటినగరంలో నియోజకవర్గ ఇంఛార్జి డా.పొన్నా యుగంధర్ అధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన మండల కమిటీ సభ్యుల పదవి ప్రమాణ స్వీకార మహోత్సవము అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ పీఏసీ సభ్యులు, చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరి ప్రసాద్ ముఖ్య అతిధులుగా విచ్చేసారు.

ఈ కార్యక్రమంలో భాగంగా నూతనంగా ఎన్నికైన మండల కమిటీ సభ్యులకు నియామక పత్రాలను అందజేశారు.

మండలంలో ఇంటి పెద్దలను కోల్పోయిన కుటుంబాలకు అండగా జనసేన పార్టీ తరపున నిత్యావసర సరుకుల, ఆర్ధిక సహాయం చేయడం జరిగింది.

జనసేన పార్టీ సిద్ధాంతాలు, పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు ఆకర్షితులై ఇతర పార్టీల నాయకులు డా.హరి ప్రసాద్ అధ్వర్యంలో జనసేన కండువా కప్పుకోవడం జరిగింది.

ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు బత్తిన మధు బాబు, రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి ఆకేపాటి సుభాషిణి, జిల్లా కార్యదర్శి దేవర మనోహర్ మరియు గౌరవ అధ్యక్షులు కార్వేటి నగరం మండల అధ్యక్షులు, కమిటీ సభ్యులు, నాయకులు, జనసేన వీర మహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు.