గాయాల పాలై రిమ్స్ హాస్పటల్ లో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించడం పేడాడ రామ్మోహన్

ఆమదాలవలస నియోజకవర్గం, సరుబుజ్జిలి మండలం, పెద్దమతలబు పేట గ్రామంలో ఇరువర్గాల మధ్య మాటలు యుద్ధం కొనసాగిస్తూ ఈ గురువారం ఒకరి పై ఒకరు దాడులు చేసుకోగా ఇరు వర్గాలకు తీవ్రంగా గాయాలయ్యాయి. గాయాల పాలై రిమ్స్ హాస్పటల్ లో చికిత్స పొందుతున్న వారిని ఆమదాలవలస నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ పేడాడ.రామ్మోహన్ రావు పరామర్శించడం జరిగింది. ఆయనతో పాటుగా సరుబుజ్జిలి మండల జెడ్పీటీసీ అభ్యర్ధి పైడి.మురళీ మోహన్, మండల నాయకులు జనార్దన్, గోవర్ధన్, భాస్కర్ జగదీష్, అప్పలనాయుడు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.