రైతుల నోట్లో మట్టి కొట్టిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం: బొలిశెట్టి శ్రీనివాస్

తాడేపల్లిగూడెం రూరల్ మండలం ఉప్పరగూడెం తాళ్లపాలెం గ్రామంలో నియోజకవర్గ జనసేన ఇన్చార్జి బొలిశెట్టి శ్రీనివాస్ జనసేన పల్లెపోరు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో రైతుల నోట్లో మట్టి కొట్టిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అని అన్నారు.రైతు పండించిన ధాన్యాన్నికొనేవారు లేకసరైన గిట్టుబాటు ధరలేక రైతులు నానా అవస్థలు పడుతున్న పట్టించుకున్న నాధుడే కరువయ్యాడని రైతులు వాపోతున్నారని బొలిశెట్టి వెల్లడించారు. పంచాయతీల్లో నిధులు లేక గ్రామాలు విలవలలాడుతున్నారని రాబోవు ఎన్నికల్లో జనసేన పార్టీకి మద్దతు పలికి పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రి చేసే విధంగా కృషి చేయాలని గ్రామస్తులను బొలిశెట్టి శ్రీనివాస్ కోరారు. ఈ కార్యక్రమంలో తాడేపల్లిగూడెం మండల అధ్యక్షులు అదప ప్రసాద్, స్థానిక నాయకులు మరపట్ల రమేష్, బాతు ప్రభుదేవా, ఏలూరి కళ్యాణ్, మరపట్ల సునీల్, తాడేపల్లి అజిత్, దాసరి ప్రభాకరరావు మరియు తాడేపల్లిగూడెం జనసేన నాయకులు, జనసైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు.