ఎన్నికల ప్రక్రియలో వాలంటీర్ల ప్రమేయం ఉండరాదు

అనంతపురము: బూత్‌స్థాయిలోని ఓటర్ల జాబితా పరిశీలన నిమిత్తం రెెవెన్యూ అధికారులు, బిఎల్‌ఒలతో చేపడుతున్న సర్వేలో వాలంటీర్ల ప్రమేయం ఉండరాదని కలెక్టర్ ఆదేశించారు.. ఇది పాటించని వారు ఉద్యోగం నుంచి తొలగించబడతారని హెచ్చరించారు. ఎం.ఆర్.ఓ ఆఫీస్ నందు శనివారం జరిగిన అన్ని పార్టీల రాజకీయ నాయకుల సమావేశం నందు జనసేన పార్టీ తరుపున అనంతపురము జనసేన జిల్లా కార్యదర్శి చొప్పా చంద్ర శేఖర్ పాల్గొనటం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాట్లాడుతూ.. ఎన్నికల ప్రక్రియలో వాలింటీర్ల ప్రమేయం లేకుండా చేయడం జనసేన పార్టీ తొలి విజయంగా బావిస్తున్నాం. చెసేదే చెబుతాం..చెప్పేదే చేస్తాం.. పాలన మారాలంటే పవన్ రావాలని చంద్ర శేఖర్ పేర్కొన్నారు.