క్రియాశీలక సభ్యత్వ కిట్లను అందజేసిన తీగల చంద్రశేఖర్

నెల్లూరు, కార్యకర్తల సంక్షేమం కోసం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ క్రియాశీలక సభత్వం తీసుకున్నవారికి ప్రమాద భీమా కల్పించారని ఆ పార్టీ ఉమ్మడి నెల్లూరు జిల్లా ఉపాధ్యక్షులు తీగల చంద్రశేఖర్ తెలిపారు. సోమవారం పాలిచర్ల, చెన్నూరు, సనత్ నగర్ ప్రాంతాల్లో క్రియశీలక సభ్యత్వం తీసుకున్న వారికి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం నుండి వచ్చిన సభ్యత్వ కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో మార్పుకు నిదర్శనంగా నియోజకవర్గంలో పెద్ద సంఖ్యలో మహిళలు, యువత జనసేన సభత్వం తీసుకున్నారనన్నారు. జనసేన పార్టీ కార్యకర్తలు, వారి కుటుంబ సభ్యులకు భద్రత కల్పించే విధంగా జనసేన పార్టీ ఐదు లక్షల రూపాయల ప్రమాద భీమా కల్పించిన ఏకైక పార్టీ జనసేనపార్టీ అన్నారు. ప్రమాదం జరిగి గాయపడితే 50 వేలు, ప్రమాదవశాత్తు మృతిచేందితే 5 లక్షల రూపాయలు కుటుంబ సభ్యులకు అందచేయడం జరుగుతుందన్నారు. క్రియాశీలక సభ్యులు జనసేన పార్టీ శ్రేణులను సమన్వయపరచుకుని జనసేన సిద్ధాంతలను, పవన్ కళ్యాణ్ ఆశయాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్ళాలని కోరారు.
ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ పట్టణ అధ్యక్షులు ఇంద్రవర్ధన్, కార్యదర్శులు వెంకటేశ్వర్లు, నారాయణ, ధన, అవినాష్, శివ సాయి, శ్రీనాథ్, మోహన తదితరులు పాల్గొన్నారు.