ఆత్మకూరు జనసేన ఆధ్వర్యంలో మూడవరోజు డిజిటల్ క్యాంపెయిన్

నెల్లూరు జిల్లా, ఆత్మకూరు నియోజకవర్గం, జనసేనపార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు నెల్లూరు జిల్లా, ఆత్మకూరు నియోజకవర్గం డి.సి.పల్లి నుండి బంటపల్లి వెళ్ళు రోడ్డు మార్గంలో రోడ్ల అధ్వాన పరిస్థితి పై డిజిటల్ క్యాంపెయిన్ నిర్వహించిన జనసేనపార్టీ ఆత్మకూర్ నియోజకవర్గ ఇంఛార్జ్ నలిశెట్టి శ్రీధర్, ఉపాధ్యక్షులు డబ్బుకోట్టు నాగరాజు ఈ పర్యటనలో భాగంగా స్థానిక ప్రజలు, సునీల్, పసుపులేటి హజరత్, యశ్వంత్ కుమార్, హరీ, మర్రిపాడు మండల ప్రధాన కార్యదర్శి సునీల్ యాదవ్, సంగం మండల అధ్యక్షులు రాకేష్ యాదవ్, మదన్ తదితరులు పాల్గొన్నారు. వాహనదారులు ప్రస్తుత వర్షాకాల సమయంలో ఎక్కువగా ప్రమాదాలకు గురి అవుతున్నట్లు, దీనిపై ప్రభుత్వం స్పందించడం లేదని తెలిపారు.