ఈ వార్త చైర్మన్ ఈశ్వర్ పై దాడి అమానుషం

పెనుకొండ: గోరంట్లలో శుక్రవారం సీనియర్ విలేకరి ఈ వార్త సీమ వార్త ఛైర్మన్ ఈశ్వర్ పై జరిగిన దాడిని జనసేన పార్టీ తరపున తీవ్రంగా ఖండిస్తున్నామని జనసేన ఉమ్మడి అనంతపురం జిల్లా సంయుక్త కార్యదర్శి వెంకటేష్ పేర్కొన్నారు. శుక్రవారం వెంకటేష్ విలేకరులతో మాట్లాడుతూ నెలల వ్యవధిలోనే ఈశ్వర్ గారిపై రెండు సార్లు దాడి జరగడం బాధాకరం. మండలంలో ఒక సీనియర్ జర్నలిస్టుపై ఇలా దాడులు జరిగితే ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏంది పట్టణ నడిబొడ్డున జరిగిన ఈ సంఘటనకి సంబంధించి స్థానిక పోలీస్ వారు సీసీ కెమెరాల ఫుటేజీ కనుగొని దాడి చేసిన నిందితులపై కఠినంగా శిక్ష తీసుకోవాలని గోరంట్లలో శాంతి భద్రతలను కాపాడాలని పోలీస్ వారిని కోరుకుంటున్నామని వెంకటేష్ పేర్కొన్నారు.