పవన్ చెప్పు చూపితే బాధపడ్డ వైసీపీ నేతలు ఆ పార్టీ ఎంపీ జిప్పు విప్పి చూపితే మాట్లాడలేదెందుకు..?

  • జిప్పు విప్పి చూపితే దేశ ప్రజలు బాధపడ్డారు, అప్పుడు మీకు బాధకలగలేదా..!
  • పవన్ కళ్యాణ్ ను తిట్టడానికి ఏపీ మంత్రులు జగన్ తో ప్యాకేజీ తీసుకుంటున్నారు..

తిరుపతి, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పై వైసిపి నేతలు విమర్శించిన సంఘటనలను, రాష్ట్రంలో మారుతున్న రాజకీయాలపై, తిరుపతిలో కొందరు వైసిపిలో ఉన్న కాపులు చేసిన వ్యాఖ్యలకు జవాబుగా బుధవారం ఓ ప్రైవేట్ హోటల్ లో జనసేన తిరుపతి ఇన్చార్జ్ కిరణ్ రాయల్, పట్టణ అధ్యక్షుడు రాజారెడ్డి, బాబ్జి, సుభాషిని, వనజ, ముక్కు సత్యవంతుడు, సుమన్ బాబు, సుమన్, రాజేష్ అచారి, హేమంత్, కిషోర్, వేణు స్వామి, విజయారెడ్డి, నవ్యా రెడ్డి, జీవన్ తదితరులు మాట్లాడుతూ పేర్నినాని నోరు అదుపులో పెట్టుకో, కాపు కులస్తులు జగన్ దగ్గర ఊడిగం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ నిజాలు మాట్లాడితే ఎందుకు మీరు ఉలిక్కిపడుతున్నారు త్వరలో ప్రజలే మీ వైసీపీ నేతలను చెప్పులతో తరిమి కొడతారు అని, ఆస్తులు కాపాడుకోవడానికే తిరుపతి తిరుమలలో కొందరు బలిజ కులస్తులు వైసీపీకి భజన చేస్తున్నారని, తిరుపతిలో బలిజలను కొందరిని భయపెట్టి వైసీపీ నేతలు వారి వెంట తిప్పుకుంటున్నారాని తిరుపతి బలిజల గుండెల్లో ఎప్పటికీ మా పవన్ కళ్యాణే ఉన్నారు, ఉంటారని వైసీపీలోని ఆ ఆరుగురు బలిజలకు పవన్ ను అడ్డుకునే దమ్ముందా వచ్చే నెలలో తిరుపతికి రానున్న జనసేనానిని అడ్డుకునే ప్రయత్నం చేస్తే మా జనసైనికుల పవర్ ఎంటో చూస్తారు వైజాగ్ సీన్ తిరుపతిలో వైసీపీకి రిపీట్ అవుతుంది అని వారు అన్నారు.