పుల్వామ ఉగ్రదాడిలో అమరులైన వీరజవాన్లకు కొవ్వొత్తులతో నివాళులర్పించిన తిరుపతి జనసేన

తిరుపతి, యావత్ భారతదేశాన్ని శోకసంద్రంలో ముంచిన పుల్వామా ఉగ్రదాడి జరిగి నేటితో మూడేళ్లైంది నాటి ఉగ్రవాదుల ఆత్మాహుతి దాడిలో అమరులైన 40 మంది సిఆర్పిఎఫ్ జవాన్లకు జనసేన పార్టీ కన్నీటి నివాళులు అర్పించారు. సోమవారం తిరుపతి నగరంలో అన్నమయ్య కూడలి వద్ద పార్టీ సిటీ ప్రెసిడెంట్ రాజారెడ్డి ఆధ్వర్యంలో అమరులైన సైనికుల చిత్రాలతో కూడిన ఫ్లెక్సీలతో, చేతిలో కొవ్వొత్తులు పట్టుకొని ఘన నివాళాలు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు బాబ్జి, హేమాకుమార్, మనోజ్, రమేష్, బాల, కిషోర్, సుమన్, సోమలబాబు, మునస్వామి, అమృత, కీర్తన, వనజ తదితరులు పాల్గొన్నారు.