Peddapuram: విజేతలకు షీల్ద్ అందించిన పాఠంశెట్టి

పెద్దాపురం, గండేపల్లి మండలం మల్లేపల్లి లో జరిగిన జిల్లా స్థాయి సీనియర్స్ కబడ్డీ పోటీల్లో పెద్దాపురం మండలం తిరుపతి టీం విజయం సాధించింది. వీరికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన జగ్గంపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ పాఠంశెట్టి సూర్యచంద్ర షీల్డ్ అందించారు. ఇటీవల జరిగిన జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు ఇప్పటికే ఈ జట్టు జగ్గంపేట మండలం, రామవరం కృష్ణవరం గ్రామాల్లో జరిగిన, జిల్లా స్థాయి కబడ్డీ పోటీల్లో కూడా ప్రధమ స్థానం సాధించారు, మల్లేపల్లిలో జరిగిన పోటీలో విజయంతో ఈ జట్టు హ్యాట్రిక్ సాధించింది. వరుస విజయాలతో దూసుకుపోతున్న తిరుపతి కబడ్డీ జట్టును, గ్రామ సర్పంచ్ మొయిళ్ళ కృష్ణమూర్తి బిజెపి జిల్లా యువ మోర్చా వైస్ ప్రెసిడెంట్(కోచ్) మొయిళ్ళ రవి, (రిటైర్డ్ ఆర్మీ జవాన్) కుంచే తాతారావు, బిఎస్ఆర్ కళాశాల డైరెక్టర్ చంటి, అడబాల సూరిబాబు, బందిల సుబ్రహ్మణ్యేశ్వర రావు, మొయిళ్ళ నాగేశ్వరరావు, బేతినీడి సూరిబాబు, లక్కరాజు మునేశ్వరరావు, గ్రామ ప్రజలు మండల క్రీడా అభిమానులు వారికి అభినందనలు తెలిపారు.