వైసిపి నాయకులకు, మీ ముఖ్యమంత్రికి దమ్ముందా..!! కిరణ్ రాయల్

  • తాజా – మాజీ మంత్రులకు జనసేన సవాల్.

తిరుపతి, సోమవారం పెంచిన ఆర్టీసీ బస్సు చార్జీలను వెంటనే తగ్గించాలంటూ ఆర్టీసి బస్టాండ్ వద్ద పెద్ద ఎత్తున జనసేన నిరసన తెలియజేసి ఆర్.ఎం.ఓ కి వినతిపత్రం అందజేసి ప్రజలపై అధిక భారాన్ని మోపవద్దని కోరడం జరిగింది. ఈ సందర్భంగా… కిరణ్ రాయల్ తిరుపతి జనసేన పార్టీ ఇన్చార్జ్ మాట్లాడుతూ… మీకు మీ నాయకులకు, ముఖ్యమంత్రితో సహా దమ్ముంటే అందరూ రాజీనామా చేసి ఎన్నికల్లకు వెళ్దాం రండి, ఎవరి దమ్ము ఎంతో తేల్చుకుందాం.. మేము ఎన్ని సీట్లలలో పోటీ చేయాలో మాకు చెప్పడానికి మీరు ఎవరు? మా నాయకుడు, మా పార్టీ, మా ఇష్టం ప్రజలు నిర్ణయిస్తారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టణ అధ్యక్షుడు రాజా రెడ్డి మాట్లాడుతూ ఏ ముహూర్తాన మీరు అధికారంలోకి వచ్చారో ఆ రోజు నుంచి రాష్ట్రంలో ప్రతి ఒక్కటి బాదుడే బాదుడు పనైపోయింది. చిత్తశుద్ధి ఉంటే పెంచిన ఆర్టీసి కరెంట్ చార్జీలను, పన్నులను నిత్యావసర ధరలు తగ్గించి మీ దమ్మేంటో ముందు మీరు నిరూపించుకోండి అని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు బాబ్జి, రాజేష్ యాదవ్, సుమన్ బాబు, ముక్కు సత్యవంతుడు, మునస్వామి, అమృత, కీర్తన, కోకిల, మనోజ్, సాయి దేవ్, కిషోర్, చరణ్, రాజేంద్ర, రాజేష్, షరీఫ్, రమేష్, హిమనోత్, పవన్ తదితరులు పాల్గొన్నారు.