రేపే మత్స్యకార అభ్యున్నతి సభ…

పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో రేపు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో గత కొన్ని రోజుల నుండి జరుగుతున్న మత్స్యకార అభ్యున్నతి యాత్రలో జనసేన పార్టీ ప్యాక్ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు.

కాకినాడ, పిఠాపురం, ముమ్మిడివరం, తణుకు వంటి పట్టణాల తో పాటు గ్రామాల్లో ఈ యాత్ర కొనసాగింది. ఈ యాత్రలో భాగంగా నాదెండ్ల మనోహర్ మత్స్యకారులతో పాటు ప్రజలతో మమేకమయ్యారు. ఉభయ గోదావరి జిల్లా ప్రజలు మనోహర్ కి ఘనస్వాగతం పలికారు. ఈ మత్స్యకార అభ్యున్నతి యాత్ర తుది అంకానికి చేరుకుంది. అందులో భాగంగా రేపు నరసాపురం లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభకు ముఖ్య అతిథిగా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పాల్గొని ప్రసంగిస్తారు.

తేదీ : 20-02-2022

వేదిక: 
జగన్నాధ స్వామి గుడి వద్ద, రుస్తుంబాద 
నరసాపురం
పశ్చిమ గోదావరి జిల్లా