డా.మాధవరెడ్డి ఆధ్వర్యంలో భారత జవానులకు ఘననివాళి

శేరిలింగంపల్లి, విజయ్ దివస్ ను పురస్కరించుకుని జనసేన పార్టీ శేరిలింగంపల్లి ఇంఛార్జి డా.మాధవరెడ్డి ఆధ్వర్యంలో భారత జవానులకు ఘనమైన నివాళి అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ వీరమహిళలు నియోజకవర్గ డివిజన్ అద్యక్షులు మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది. అనంతరం తెలంగాణ రాష్ట్ర శాసన సభ ఎన్నికల ఫలితాల అనంతరం జనసేన పార్టీ శేరిలింగంపల్లి నియోజకవర్గ ఇంఛార్జి డాక్టర్ మాధవరెడ్డి ఆధ్వర్యంలో రివ్యూ మీటింగ్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భవిష్యత్ కార్యాచరణపై చర్చించి నియోజకవర్గంలో ఉన్న ప్రజా సమస్యలపై అను నిత్యం పోరాటం చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటూ పార్టీ కార్యక్రమాలను, నిర్ణయాలను ప్రజలలో తీసుకెళ్తూ ఉండాలని దిశా నిర్దేశం చేశారు. ఎన్నికలలో పని చేసిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా ధన్యవాదాలు తెలియచేశారు. ఈ కార్యక్రమంలో వీరమహిళలు డివిజన్ అద్యక్షులు పాల్గొని విజయవంతం చేశారు.