భార్గవ్ మృతికి సానుభూతి తెలియజేసిన పోతిన వెంకట మహేష్
పసుపుల భార్గవ్ చివరి కోరిక అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ ని కలవడం, అందుకు అందరు కృషి చేశారు. శ్రీ పవన్ కళ్యాణ్ భార్గవ ఇంటికి వచ్చి పరామర్శించి ఎంతో నైతిక ధైర్యం కల్పించారు. అయినప్పటికీ భగవంతుని కరుణ భార్గవ పై లేకుండా పోయింది. భార్గవ్ పుణ్యలోకాలు ప్రాప్తించాలని భగవంతుని ప్రార్ధిస్తూ వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని పోతిన వెంకట మహేష్ విజయవాడ నగర అధ్యక్షులు జనసేన పార్టీ తెలిపారు.