అనంతసాగరం జనసేన ఆధ్వర్యంలో మహాత్మా గాంధీకి నివాళి

ఆత్మకూరు నియోజకవర్గం, అనంతసాగరం మండలం జనసేన పార్టీ ఆధ్వర్యంలో జాతిపిత మహాత్మా గాంధీ 153 వ జయంతి సందర్భంగా చిత్రపటాన్ని పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు షేక్ మహబూబ్ మస్తాన్, మండల కార్యదర్శి మెట్టమల్ల పెంచలయ్య మండల సంయుక్త కార్యదర్శి షేక్ ఖాజా మస్తాన్, రషీద్, సుభాని పాల్గొనడం జరిగింది.