జనసేన పార్టీ కార్యాలయంలో మదర్ థెరిస్సాకు ఘననివాళి

ఉమ్మడి ప్రకాశం జిల్లా, చిన్నగంజాం మండలం, కడవకుదురు జనసేన పార్టీ కార్యాలయంలో మదర్ థెరిస్సా జయంతిని పురస్కరించుకొని ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దపూడి విజయ్ కుమార్ మాట్లాడుతూ ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతుల మిన్న అనే నానుడిని నిజం చేస్తూ అనేక సేవా కార్యక్రమాలను చేసి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన మానవతా మూర్తి అని ఆమె చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు సందు శ్రీనివాసరావు మండల ప్రధాన కార్యదర్శి అడుసుమల్లి హరిబాబు పర్చూరు నియోజకవర్గ నాయకులు తోట అశోక్ చక్రవర్తి, గంట వెంకటేష్, జిల్లా సంయుక్త కార్యదర్శి షేక్ ఇంతియాజు, తుమ్మలపెంట సతీష్, పారాబత్తుల ప్రసాదు తదితరులు పాల్గొన్నారు.