నవీన్ కుటుంబానికి 5 లక్షల చెక్కు అందజేసిన జనసేన నాయకులు

అదిలాబాద్ జిల్లా, నిర్మల్ నియోజకవర్గంలో ప్రమాదంలో మరణించిన క్రియాశీలక కార్యకర్త ఎం.నవీన్ కుటుంబానికి అండగా అధ్యక్షులు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఇచ్చిన 5 లక్షల రూపాయల చెక్కును జూబ్లీహిల్స్ పార్టీ కార్యాలయంలో నవీన్ కుటుంబ సభ్యులకు జనసేన పార్టీ రాష్ట్ర ఇంచార్జ్ నేమూరి శంకర్ గౌడ్, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు రాధారం రాజలింగం, దామోదర్ రెడ్డి సభ్యత్వం చేయించిన వాలంటర్ శ్రీరామ్ శ్రీనివాసు చేతుల మీదుగా చెక్కును అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పర్యవేక్షణ సభ్యులు సురేష్, కుత్బుల్లాపూర్ ఇంఛార్జి సతీష్, పటాన్ చెరు ఇంఛార్జి రాజేష్, కాల్వతాండ సర్పంచ్ శ్రీ రామావత్ రవి, శ్రీరాముల శ్రీనివాస్, అంగోత్ టీకాజీ, ది.రవీందర్, జె.మిట్య, రుపెందేర్, ది.రోహిదాస్, ఎం.సవీన్, జె.సురేష్, ఏ. తరుణ్, శ్రీరాముల తేజ తదితరులు పాల్గొన్నారు.