వంగవీటి మోహన్ రంగ విగ్రహాన్ని పరిశీలించిన డాక్టర్ పిల్లా శ్రీధర్

పిఠాపురం, దివంగత నేత వంగవీటి మోహన్ రంగ విగ్రహాన్ని ధ్వంసం చేసిన వ్యక్తులను వెంటనే అరెస్టు చేయాలని పిఠాపురం నియోజకవర్గ జనసేన నాయకులు డాక్టర్ పిల్లా శ్రీధర్ పోలీసులకు విజ్ఞప్తి చేశారు. యు.కొత్తపల్లి మండలం, కొత్తపల్లి గ్రామం సెంటర్లో ఉన్న దివంగత నేత వంగవీటి మోహన్ రంగా విగ్రహాన్ని గుర్తుతెలియని వ్యక్తులు విగ్రహం చేతిని ధ్వంసం చేశారు. విషయం తెలుసుకున్న డాక్టర్ పిల్లా శ్రీధర్ వంగవీటి మోహన్ రంగ విగ్రహాన్ని పరిశీలించారు అనంతరం వంగవీటి మోహన్ రంగా విగ్రహం ఎదుట నిరసన తెలియజేశారు. దోషుల్ని వెంటనే అరెస్టు చేయాలని నినాదాలు చేశారు అనంతరం డాక్టర్ పిల్లా శ్రీధర్ మీడియాతో మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.