జనసేన ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ కు ఘన నివాళులు

శేరిలింగంపల్లి నియోజకవర్గం: తెలంగాణ భావజాల వ్యాప్తి కోసం తన జీవితాన్నే అంకితం చేసి స్వరాష్ట్ర సాధనకు మార్గం సుగమం చేసిన మహనీయులు, తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య శ్రీ కొత్తపల్లి జయశంకర్ జయంతి సందర్భంగా.. ఆ మహనీయుడికి జనసేన పార్టీ శేరిలింగంపల్లి ఇంచార్జ్ డా. మాధవరెడ్డి ఆదేశాల మేరకు వారి చిత్ర పటానికి జనసేన ఆధ్వర్యంలో ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ వీరమహిళ దాక్షాయణి, నాయకులూ మల్లేష్ ముదిరాజ్, హనుమంత్ నాయక్, సేవ్య నాయక్, మొత్య నాయక్, గాంది, రఘ, వినీష్, మణ్యమ్, రవి నాయక్ తదితరులు పాల్గొన్నారు.