వర్ధన్ అనాధాశ్రమంలో అన్నదానం, పండ్లు పంపిణీ

జనగామ:  జంజాల నాని పుట్టినరోజు సందర్భంగా నాని తమ పుట్టినరోజు వేడుకలను ఆదివారం జనగామ జిల్లా కేంద్రంలోని వర్ధన్ అనాధాశ్రమంలో చిన్నారుల మధ్య ఘనంగా జరుపుకున్నారు. కార్యక్రమంలో భాగంగా అన్నదానం, పండ్లు పంపిణీ చేసారు. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ.. చిన్నారులకు అన్నదానం చేయడం చాలా తృప్తిగా ఉందన్నారు. చేరదీసిన ఆశ్రమ నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. సేవ చేసేందుకు ప్రేరణ కల్పిస్తున్న పవన్ కళ్యాణ్ హెల్పింగ్ పీపుల్ సంస్థ సభ్యులను ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా దయాకర్, సందీప్, శివరాజ్, శ్రీకాంత్, క్రాంతి, అక్బర్, జాంగిర్, అజయ్, రవి, జోగు భాస్కర్, రంజిత్, జోగు ఉదయ్, నరేంద్ర పవన్, శివ, గుజ్జుల నాలిన్, రోహిత్, సాయి మను, నాని, ఆలకుంట్ల ప్రశాంత్, దిలీప్ తదితరులు పాల్గొన్నారు.