శేరిలింగంపల్లి జనసేన ఆధ్వర్యంలో వీర జవాన్లకు ఘన నివాళులు

శేరిలింగంపల్లి, 2019 ఫిబ్రవరి 14న జరిగిన పుల్వామా దాడిలో అమరులైన వీర జవాన్ల ఆత్మకు శాంతి చేకూరాలని జనసేన పార్టీ శేరిలింగంపల్లి నియోజకవర్గం లింగంపల్లి డివిజన్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇందుమతి దొంతోజు ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నియోజకవర్గ ఇంచార్జి డాక్టర్ మాధవరెడ్డి పాల్గొని, అనంతరం మాట్లాడుతూ దాడిలో అమరత్వం పొందిన జవాన్ల ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ సమాజ శ్రేయస్సు కోసం పోలీస్ శాఖ ఎల్లవేళలా అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వీర మహిళలు విభాగ కో-ఆర్డినేటర్ లు, వివిధ డివిజన్ అధ్యక్షులు మరియు నియోజకవర్గ జనసైనికులు పాల్గొన్నారు.