జనసేనలో చేరిన యువత

ఉరవకొండ, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆశయాలు, సిద్ధాంతాలకు ఆకర్షితులై ఉరవకొండలో పలువురు యువత జనసేన పార్టీలో చేరడం జరిగింది. ఈ క్రమంలోనే తాజాగా ఉరవకొండ నియోజకవర్గం చాబల, హోతురు, ప్యాపిలి గ్రామాలకు చెందిన వివిధ పార్టీలకి చెందిన యువత జనసేన తీర్థం పుచ్చుకున్నారు. గురువారం ఉరవకొండ కేంద్రంలోని జనసేన కార్యాలయంలో నరేంద్ర ఆధ్వర్యంలో ఇంచార్జి గౌతమ్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా గౌతమ్ కుమార్ మాట్లాడుతూ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి క్రమశిక్షణతో పవన్ కళ్యాణ్ అడుగుజాడల్లో నడవాలని సూచించారు. రానున్న ఎన్నికల్లో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు జనసేన-టిడిపి ఉమ్మడి అభ్యర్థి విజయానికి శక్తివంచన లేకుండా కృషి చేయాలని కోరారు. మీకు అన్నివేళలా తాను అందుబాటులో ఉంటూ అండగా నిలుస్తారని పేర్కొన్నారు.
• వజ్రకరూరు మండల అధ్యక్షులు కేశవ మాట్లాడుతూ మండల వ్యాప్తంగా ప్రతి గ్రామాల్లో పర్యటిస్తామని తెలియచేశారు
• ఉరవకొండ మండల అధ్యక్షులు చంద్రశేఖర్ మాట్లాడుతూ జనసేన పార్టీకోసం సమిష్టిగా పనిచేయాలని కోరారు.
• చాబాల నరేంద్ర మాట్లాడుతూ జనసేన పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తామని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ఉరవకొండ మండల అధ్యక్షులు చంద్రశేఖర్, వజ్రకరూరు మండల అధ్యక్షులు ఆచనాల కేశవ, జనసేన నాయకులు రాజేష్, హరి శంకర్ నాయక్, సూర్యనాయక్, మణికుమార్, సోము, వంశీ, మనోహర్, భీమేష్, మహేష్ హరున్, రాజేష్, హరి మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.