పర్యావరణం కాపాడేందుకు తిరుమల ప్రసాదానికి సంబంధించి టీటీడీ కీలక నిర్ణయం

ఇకపై తిరుమల శ్రీవారి ప్రసాదం అందించే ప్లాస్టిక్ బ్యాగ్‌ల స్థానంలో జనపనారతో తయారు చేసిన బ్యాగ్‌లను అందించాలని టీటీడీ నిర్ణయించింది. ప్లాస్టిక్ బ్యాగుల కారణంగా పర్యావరణం పాడైపోతుందని.. టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది. లడ్డూలను బట్టి సంచులు తయారు చేసింది.. ధరల్ని నిర్ణయించింది. ఐదు లడ్డులు పట్టే బ్యాగ్ ధర రూ.25.. 10 లడ్డూలు పట్టే బ్యాగ్ ధర రూ.30.. 15 లడ్డూలు పట్టే బ్యాగ్ ధర రూ. 35. మరియు 25 లడ్డూలు పట్టే బ్యాగ్ ధర రూ.55గా నిర్ణయించింది. లడ్డూల నెయ్యి వంటి పదార్ధాలను ఈ బ్యాగులు పీల్చవు. దీంతో ఇందులో తీసుకెళ్లే లడ్డూలు పాడైపోకుండా ఎక్కువ కాలం ఉండేందుకు అవకాశం ఉంటుంది. ఈ సంచులు క్యారీ చేసేందుకు ఈజీగా ఉండటంతో ఈ బ్యాగ్లను కొనుగోలు చేసేందుకు భక్తులు ఆసక్తి చూపుతున్నారు.. ప్లాస్టిక్ బ్యాగ్‌లు తీసేసినందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.