పీపుల్స్ వాయస్ ఆఫ్ జనసేన టీం ఆధ్వర్యంలో 2 కుటుంబాలకు చేయూత

విశాఖపట్నం, దక్షిణ నియోజకవర్గం పీపుల్స్ వాయస్ ఆఫ్ జనసేన టీం తరపున రెల్లి వీధి జబ్బార్ తోట 37వ వార్డుకి చెందిన దంగ తోట (50) ఇద్దరు పిల్లలు దంగ రాజు (కొడుకు 26) దంగ హేమ (కూతురు 18) మతిస్థిమితం సరిగా లేదు మరియు జ్యోతి (32) వారి కుటుంబానికి జనసైనికులు మరియు వీరమహిళల ఆధ్వర్యంలో నెలకు సరిపడా బియ్యం, కిరాణా మరియు కూరగాయలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో రామలక్ష్మి, షాలిని, కళ్యాణ్ నాయుడు, భాస్కర్,యర్రంశెట్టి సురేష్, గరికిన రవి, గరికిన హరీష్, లక్ష్మణ, లుక్స్ గణేష్, తెలుగు అర్జున గోరుపు శ్రీనులు పాల్గొనడం జరిగింది.