తాడిపత్రిలో రైతు భరోసా పోస్టర్లు

తాడిపత్రి నియోజక వర్గంలోని మండలాలలో జనసైనికులు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన రైటుభారోసా యాత్రకు సంబందించిన పోస్టర్లను తాడిపత్రి పట్టణ మరియు నియోజకవర్గంలోని అన్ని మండలాలలో అంటించి పవన్ కళ్యాణ్ కౌలు రైతులు ఆత్మ హత్యలకు పాల్పడిన రైతు కుటుంబాలకు భరోసా కల్పిన్చేందుకు చేసే ప్రయత్నాన్ని ప్రజలలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేయడం జరిగింది. ఈ కార్యక్రమం తాడిపత్రి జనసేన నాయకులు కుందుర్తి నరసింహాచారి మరియు రాష్ట్ర చిరంజీవి యువత పట్టణ అధ్యక్షుడు ఆటోప్రసాద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఇందులో అనంతపురం జిల్లా కార్యనిర్వహక సభ్యులు మదినేని గోపాల్, ఏ అల్థాఫ్ మరియు జనసైనికులు షేక్ సాధక్ వలి, అమీర్, పవన్ కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.