జనసేన పోరుబాటకు అనూహ్య స్పందన

ఏలూరు నియోజకవర్గం కొమడవోలు పంచాయతీ 1వ డివిజన్ లోని (పార్ట్ -3) సాయినగర్ కాలనీ, నల్లదిబ్బలో ప్రజా సమస్యలపై జనసేన పోరుబాట కార్యక్రమంలో గడప గడపకు ప్రచారానికి వచ్చిన జనసేన పార్టీ కన్వీనర్ రెడ్డి అప్పల నాయుడుకి బ్రహ్మరథం పడుతున్న ప్రజలు. పవన్ కళ్యాణ్ ని సియం చేసి ప్రతి సమస్యను పరిష్కరిస్తారని గట్టి నమ్మకంతో ఉన్నామని స్థానిక ప్రజలు వెల్లడించారు. ఈ సందర్భంగా రెడ్డి అప్పల నాయుడు మాట్లాడుతూ మేము చేపట్టిన ఈ పోరుబాట పాదయాత్రలో విశేష స్పందన లభిస్తోంది. కార్మిక రంగం నుండి వచ్చిన వాడిని కాబట్టి నాకు ప్రతి సమస్య మీద అవగాహన ఉంది. మీరు ఆశీర్వదిస్తే రాబోయే రోజుల్లో జనసేన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి ఒక్క డివిజన్ లోని ఉన్నటువంటి సమస్యలు అన్నింటినీ పరిష్కరిస్తానని రెడ్డి అప్పల నాయుడు భరోసా ఇచ్చారు. ఈ ప్రభుత్వ పాలనకు చరమగీతం పాడాలని బెదిరింపులతో, దౌర్జన్యాలతో పరిపాలన ఎక్కువ కాలం నిలబడవని అధికార పార్టీ వైసీపీకీ రాబోయే ఎన్నికల్లో తగిన గుణపాఠం ప్రజలు చెబుతారని జిల్లా అధికార ప్రతినిధి, జనసేన పార్టీ ఏలూరు ఏలూరు నియోజకవర్గ కన్వీనర్ రెడ్డి అప్పల నాయుడు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో లీగల్ సెల్ అధ్యక్షులు నిమ్మల జ్యోతి కుమార్, జిల్లా ఉపాధ్యక్షులు ఇళ్ళ శ్రీనివాస్, నగర అధ్యక్షుడు నగిరెడ్డి కాశీ నరేష్, మండల అధ్యక్షుడు వీరంకి పండు, ఫ్యాన్స్ ప్రెసిడెంట్ దోసపర్తి రాజు, ప్రధాన కార్యదర్శి సరిది రాజేష్, అధికార ప్రతినిధి అల్లు సాయి చరణ్ తేజ్, సోషల్ మీడియా కో ఆర్డినేటర్ జనసేన రవి, జాయింట్ సెక్రటరీ ఎట్రించి ధర్మేంద్ర, కోశాధికారి పైడి లక్ష్మణరావు, వీరమహిళ లంకా ప్రభావతి మరియు ఏలూరు నియోజకవర్గ జనసేన నాయకులు గొడవర్తి నవీన్, బుధ్ధా నాగేశ్వరరావు, ఆంజనేయులు, అంబికా నాని, సత్యనారాయణ, చందూ, తోట రవి, బలరాం, గోపి, కూనిశెట్టి మురళి, పవన్, పవనిజం పండు, కరెడ్ల వెంకట కృష్ణ, కరెడ్ల నూకరాజు, ఎట్రించి మహేష్ మరియు కార్యకర్తలు, వీర మహిళలు, డివిజన్ ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.