జానపాడులో ఘనంగా జనసేన జెండా ఆవిష్కరణ

  • రాష్ట్రంలో జనసేన జెండా ఎగరవేస్తాం: గాదె

గురజాల నియోజకవర్గం, పిడుగురాళ్ల మండలం, జానపాడు గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి, జనసేన జెండా ఆవిష్కరణ మరియు భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది, ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వర రావు, జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి కమాల్, జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాయపాటి అరుణ, జనసేన పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు అడపా మాణిక్యాలరావు, నారదాసు ప్రసాద్, జనసేన పార్టీ జిల్లా అధికార ప్రతినిధి తవిటి భవనారాయణ, మొదలగు రాష్ట్ర మరియు జిల్లా నాయకులు పాల్గొన్నారు. ముందుగా పిడుగురాళ్లలో గవర్నమెంట్ కాలేజీ వద్ద నాయకులకి ఘనంగా స్వాగతం పలికి, అక్కడినుంచి జనసైనికులు భారీ ర్యాలీగా బయలుదేరి, జానపాడులోని సభ వేదిక వద్దకు చేరుకోవడం జరిగింది. అనంతరం నాయకులు మాట్లాడుతూ… 2024లో జనసేన జెండా ఎగరవేయటం ఖాయమని, ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, ఈ అవినీతి రౌడీ రాజ్యాలను గద్దె దించి, జనసేన పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ప్రజలు ఎదురుచూస్తున్నారని, జనసేన పార్టీకి కార్యకర్తలే బలమని, త్వరలో గురజాల నియోజవర్గానికి ఇన్చార్జిని కళ్యాణ్ ప్రకటిస్తారని తెలియజేశారు. జనసేన పార్టీరాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ మాట్లాడుతూ… అవినీతి లేని సుపరిపాలన కావాలంటే జనసేన పార్టీ అధికారంలోకి రావాలని, రాష్ట్రంలో అవినీతి మచ్చలేని, నిజాయితీగల నాయకుడు ఒక పవన్ కళ్యాణ్ మాత్రమేనని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పిడుగురాళ్ల జనసేన పార్టీ మండల అధ్యక్షుడు కామిశెట్టి రమేష్, జిల్లా సంయుక్త కార్యదర్శి దూదేకుల కాసిం సైదా, కార్యదర్శి బడిదల శ్రీనివాసరావు, కటకం అంకారావు, అంబటి మళ్లీ, షరీఫ్, మండల అధ్యక్షులు నరసింహారావు, బొమ్మ శీను, మందపాటి దుర్గారావు, నియోజవర్గ ఐటీ కోఆర్డినేటర్ మునగా వెంకట్, జిల్లా కార్యక్రమాల కమిటీ సభ్యులు దూదేకుల సలీం, పసుమర్తి మని, వేల్పుల చైతన్య, గ్రామ అధ్యక్షులు పసుపులేటి నరసింహారావు, అంబటి సాయి,ఆవుల రమేష్, ఆకుల సుబ్బారావు మొదలగు వారు పాల్గొన్నారు.