కంచిరావుపల్లి తండాలో జనసేన జెండా ఆవిష్కరణ

  • జనసేన జెండా స్థూపం ఆవిష్కరించిన వనపర్తి కోఆర్డినేటర్ ముకుంద నాయుడు

వనపర్తి నియోజకవర్గం: వనపర్తి జిల్లా, పెబ్బైర్ మండలం కంచిరావుపల్లి తండా గ్రామంలో ఆదివారం నూతనంగా నిర్మించిన జనసేన పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ వనపర్తి నియోజకవర్గ కోఆర్డినేటర్ ముకుంద నాయుడు పాల్గొని జెండాను ఎగుర వేశారు. ఈ సందర్భంగా ముకుంద నాయుడు మాట్లాడుతూ గ్రామంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేపట్టిన గ్రామ యువ నాయకులు రాజు నాయక్ గారికి అభినందనలు తెలిపుతూ జనసేన పార్టీ కార్యకర్తలు పార్టీ పురోభివృద్ధికి కష్టపడి పనిచేస్తే వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ బలమైన రాజకీయ శక్తిగా మారడం తథ్యమన్నారు. ప్రజా సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. యువత అందరూ జీరో బడ్జెట్ పాలిటిక్స్ వైపు అడుగులు వేసి నూతన రాజకీయ వ్యవస్థ దిశగా ప్రయాణం చేస్తూ కొత్త తరం యువకులకు ప్రాధాన్యత కల్పిస్తున్న జనసేన పార్టీకి అండగా నిలవాలి అని తెలిపారు. రాబోయే స్థానిక ఎన్నికలు లక్ష్యంగా ఇప్పటి నుంచే గ్రామ స్థాయిలో యువకులు బలోపేతం కావాలని సూచించారు.