కొత్తకోట పంచాయతీలో ఘనంగా జనసేన జెండా ఆవిష్కరణ

  • జనసేన జెండా ఆవిష్కరించిన ఎచ్చెర్ల నియోజకవర్గ జనసేన నాయకురాలు శ్రీమతి కాంతిశ్రీ

ఎచ్చెర్ల నియోజకవర్గం, లావేరు మండలం, బుధవారం కొత్తకోట పంచాయతీలో ఘనంగా జనసేన జెండా ఆవిష్కరించిన ఎచ్చెర్ల నియోజకవర్గ జనసేన నాయకురాలు శ్రీమతి కాంతిశ్రీ, కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళలు, యువత పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా వారు ఎదుర్కొంటున్న సమస్యలను 40 సంవత్సరాలుగా తెలియచేస్తూ, ఇతర పార్టీలను చూస్తూ విసిగి, నమ్మకం పోయిందని, ఇప్పుడు ప్రజలంతా జనసేనపార్టీ వైపే చూస్తున్నారని, నాయకులు కాంతిశ్రీకి తెలియజేసి, వచ్చే ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి తప్పకుండా ఓటు వేసి గెలిపిస్తామని తెలిపి వారి చేతుల మీదగా పార్టీ కండువా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో జనసైనుకులు బార్నాల దుర్గారావు, బాబాజీ, పవన్ కళ్యాణ్, సూర్యనారాయణ, చిరంజీవి, గొల్లబాబు, నీలం నాయుడు, శంకర్, సంజయ్ మరియు గ్రామ యువత పాల్గొన్నారు.