ప్రజాసమస్యలపై పిఠాపురం జనసేన చేసిన పోరాటానికి దక్కిన మరో విజయం

పిఠాపురం, ఈ సమస్యపై వెంటనే స్పందించిన పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబుకి, మునిసిపల్ చైర్ పర్సన్ గండేపల్లి సూర్యావతి బాబీ, 23 వ వార్డు కౌన్సిలర్ అయితే రాంబాబు, కాంట్రాక్టర్ కొత్తేం భానుకి మా హృదయపూర్వక కృతజ్ఞతలు మరియు అభినందనలు. ఆ పురుహూతికా అమ్మవారు, శ్రీ కుక్కుటేశ్వర స్వామి, శ్రీపాద వల్లభుడు, శ్రీ దత్తాత్రేయుని ఆశీస్సులతో పిఠాపురంను మరింతగా అభివృద్ధి చెయ్యాలని, ప్రజా సమస్యలకు త్వరితగతిన పరిష్కారం చూపాలని మరొక్కసారి మా జనసేన తరుపున మనవి చేస్తున్నామని తెలిపారు. పిఠాపురం మున్సిపాలిటీ 23వ వార్డు నూకలమ్మ గుడి దగ్గర నుండి పోలీస్ స్టేషన్ కి వెళ్ళే ముఖ్య రహదారి పూర్తిగా గతుకులతో నిండిపోయి పోయిందని గత వారంలో జనసేన తరుపున ప్రశ్నించడం జరిగింది. దేశవ్యాప్తంగా అనేక మంది భక్తులు ఇబ్బంది గురియావుతున్నారు అని తెలపడం. ఈ సమస్యలపై ఆ వార్డు కౌన్సిలర్ ఆయితే రాంబాబు (టిడిపి) చాలా సానుకూలంగా స్పందించారు. సంవత్సరంన్నర క్రితమే ఈ రోడ్డుకి నిధులు మంజూరు కాగా ఇసుక రేట్లు పెరిగి కాంట్రాక్టర్ నష్టపోయేలా ఉండటంతో… అయితే ఎమ్మెల్యే, చైర్మన్, డిఈ చొరవ తీసుకుని, విడుదల అయ్యిన నిధులకు ఎంత వరకు అయితే అంత రోడ్డు వెయ్యాలని మిగిలిన రోడ్డుకు కొత్త ఎస్టిమేషన్ ఇవ్వాలని చెప్పినట్లు తెలుస్తోందని తెపారు.