జనసేనలో చేరిన కరప మండల ఉప్పలంక గ్రామ టీడీపీ కార్యకర్తలు

జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు, కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీ స్వగృహం వద్ద అయన సమక్షంలో కరప మండలం ఉప్పలంక గ్రామం టీడీపీ కార్యకర్తలు సుమారు 15మంది లంకడి వెంకటరమణ, చింత నాని, చెక్క అప్పన్న, బొమ్మడి సతీష్, చెక్క శ్రీను, రేఖడి రాము, ఒలేటి వీరబ్రహ్మం, మల్లాడి వీరబాబు, పాలేపు గణేష్, పి కామేష్, వనమాడి ప్రసాద్, ఆకుల అర్జున్ తదితరులు ఉప్పలంక జనసేన నాయకులు సంగడి శ్రీనివాస్గారు, భోగిరెడ్డి కొండబాబు, మండల అధ్యక్షులు బండారు మురళి, జనసేనాపార్టీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ భోగిరెడ్డి గంగధర్ నాయకత్వంలో నేడు జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు. వీరందరికి పార్టీ కండువాలు వేసి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించిన పంతం నానాజీ. ఈ కార్యక్రమంలో కరెడ్ల గోవింద్, డొక్కాడి శ్రీనివాస్, తాటికాయల వీరబాబు, శిరంగు శ్రీనివాస్, సింగిరెడ్డి సత్తిబాబు, పెంటబాబు సుబ్రహ్మణ్యం, యేసు, బండారు మణికంఠ, చెక్కపల్లి మల్లిబాబు, మామిడిశెట్టి మల్లేష్, పుల్ల పెదకాపు తదితరులు పాల్గొన్నారు.