ఉరవకొండ జనసేన-టీడీపీ ఆత్మీయ సమావేశం

  • శాసనభ్యులు పయ్యావుల కేశవ్ ని కలిసిన బెలుగుప్ప మండల జనసైనికులు

ఉరవకొండ, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఉరవకొండ నియోజకవర్గం శాసనసభ్యులు పయ్యావుల కేశవ్ అధ్యక్షతన జరిగిన ఆత్మీయ సమావేశంలో 2024 సార్వత్రిక ఎన్నికల్లో జనసేన టీడీపీ పొత్తులో రాక్షస పాలనకు చరమగీతం పడే దిశగా జనసైనికులు కృషి చేయాలని, పొత్తులో భాగంగా ఇరుపార్టీల నాయకులు కలిసి ముందుకు పోవాలని కేశవ్ సూచించారు. ఈ కార్యక్రమంలో బెలుగుప్ప మండల జనసేన నాయకులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.