విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు డిజిటల్ క్యాంపెయిన్ విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన ఉత్తరాంధ్ర జనసేన

*జనసేన పార్టీ నాయకులకు వీరమహిళలకు మరియు జన సైనికులకు విజ్ఞప్తి

విశాఖ జిల్లా, జనసేన పార్టీ అధినేత గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు, విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణే లక్ష్యంగా జనసేన పార్టీ తరఫున ఈ నెల 18, 19, 20 తేదీల్లో డిజిటల్ క్యాంపెయిన్ చేపట్టడం జరుగుతుంది. ఇందులో భాగంగా శనివారం(18-12-2021)ఉదయం 9.30 గంటలకు జీవీఎంసీ ఎదురుగా గల గాంధీ విగ్రహం వద్ద జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ తమ్మిరెడ్డి శివ శంకర్, జనసేన పార్టీ రాష్ట్ర పర్యావరణ ప్రధాన కార్యదర్శి శ్రీ బొలిశెట్టి సత్య మరియు ముఖ్య నాయకుల ఆధ్వర్యంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్లే కార్డ్స ప్రదర్శన కార్యక్రమం నిర్వహించబడునని, ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నామని ఉత్తరాంధ్ర జనసేన ఒక ప్రకటనలో పేర్కొనడం జరిగింది.