మాడుగుల జనసైనికులను ప్రశంసించిన కొత్తవలస గ్రామస్థులు

రోడ్డు మరమ్మత్తు కోసం వచ్చి సహాయ సహకారాలు అందించిన మాడుగుల మండల జనసైనికులకు ధన్యవాదాలు తెలిపి హర్షం వ్యక్తం చేసిన కొత్తవలస గ్రామ జనసైనికులు మరియు గ్రామస్థులు

వి.మాడుగుల నియోజకవర్గం, గురువారం జరిగిన డి.గొట్టివాడకి శంకరం పంచాయితీ కొత్తవలస గ్రామానికి మధ్యలో ఉన్న రహదారికి సంబంధించిన మరమ్మత్తులు చేయడం కోసం జనసేన పార్టీ ఆద్వర్యంలో చేపట్టిన కార్యక్రమం విజయవంతంగా చేసినందుకుగాను గ్రామ ప్రజలందరు మరియు కొత్తవలస గ్రామ జనసైనికులు అందరూ మాడుగుల మండల జనసైనికులను అభినందించారు. ఈ సందర్భంగా మాడుగుల జనసైనికులు మాట్లాడుతూ మాడుగుల మండలంలో ఎక్కడైనా ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్లు అయితే తమ దృష్టికి తీసుకువస్తే ఆ సమస్యను పరిష్కరించడానికి జనసేన పార్టీ ఎప్పుడు మీ వెంటే ఉంటుందని హామీ ఇచ్చారు. అంతేకాకుండా ఈ సమస్యను సోషల్ మీడియా ద్వారా తమ దృష్టికి తీసుకు వచ్చినందుకు కొత్తవలస గ్రామ జనసైనికులునీ అభినందించారు. ముందు ముందు ఇటువంటి మంచి కార్యక్రమాలకి తమ వంతు కృషి చేస్తామని మాడుగుల జనసేన పార్టీ తెలియజేశారు. అధికార పార్టీకి భయపడకుండా ప్రజా ప్రతినిధులుకి భయపడకుండా గ్రామంలో రహదారి వలన పడుతున్న ఇబ్బందుల కోసం సమస్యను జనసైనికులు అందరికీ తెలియజేసినందుకు గాను మండల జనసైనికులు అందరూ ఆ గ్రామ జనసైనికుల్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో మాడుగుల నియోజకవర్గం నుంచి గుమ్మడి శ్రీరామ్ మరియు మాడుగుల జనసేన పార్టీ టౌన్ అధ్యక్షులు రొబ్బా మహేష్, జనసేన వీరమహిళ వీరా సురేఖ, యన్నంశెట్టి సీతారాం, గండ్రెడ్డి శివాజీ, కలిపిరెడ్డి రాజా, దాసరి అచ్చుతరావు, గుమ్మాల నానాజీ, బలరాం, కొత్తవలస గ్రామ జనసైనికులు పాల్గొన్నారు.