ప్రభుత్వ ఉద్యోగుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న వైకాపా ప్రభుత్వం

అనంతపురం: ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన ప్రభుత్వ ఉద్యోగి మల్లేష్ నీ అనంతపురం ప్రభుత్వ సర్వజన వైద్యశాలకి వెళ్లి రాయలసీమ రీజినల్ ఉమెన్ కో- ఆర్డినేటర్ పెండ్యాల శ్రీలత పరామర్శించారు. ప్రభుత్వం సరైన సమయంలో జీతాలు చెల్లించక ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ప్రభుత్వ ఉద్యోగి మల్లేష్ నీ ప్రభుత్వ సర్వజన వైద్యశాలకి వెళ్లి పారమర్షించిన రాయలసీమ రీజినల్ ఉమెన్ కో-ఆర్డినేటర్ పెండ్యాల శ్రీలత ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులకు సరైన సమయంలో జీతాలు చెల్లించడం లేదని వైకాపా ప్రభుత్వం ఎన్నికల హామీలో ఇచ్చిన సిపీఎస్ రద్దు మొదలైన అనేక హామీలను తుంగలో తొక్కిందని ఈవిశాయన్నే మల్లేష్ కూడా లెటర్ లో రాసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు సరైన సమయానికి రాక వారు తీసుకున్న ఈ.ఎం.ఐ లు ఇతర రుణాలు చెల్లించడం కష్టతరమయ్యి మానసిక ఒత్తిడికి లోనై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఈ వైసీపీ ప్రభుత్వానికి రోజుల దగ్గర పడ్డాయని అన్ని వర్గాల ప్రజలను పట్టిపీడిస్తుందని తప్పకుండా ప్రజలు రాబోయే ఎన్నికలలో బుద్ది చెబుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో వీరమహిళలు, జనసేన నాయకులు తదితరులు పాల్గొనడం జరిగింది.