సాయిన్ పల్లి గ్రామంలో వంగ లక్ష్మణ్ గౌడ్ పాదయాత్ర

  • వంగ లక్ష్మణ్ గౌడ్ పాదయాత్ర 15వ రోజు

నాగర్ కర్నూల్, పల్లె పల్లె ఎగరాలి పవనన్న జెండా రెండవ విడత కార్యక్రమంలో భాగంగా బిజినపల్లి మండలం, సాయిన్ పల్లి గ్రామంలో వంగ లక్ష్మణ్ గౌడ్ ఆదివారం పాదయాత్ర చేపట్టారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జనసైనికులతో కలిసి, పాదయాత్రగా గ్రామంలో పర్యటించారు. గ్రామంలోని ప్రజల సమస్యలు తెలుసుకుంటూ, పార్టీ సిద్ధాంతాలను ప్రజలకు వివరిస్తూ, కార్యక్రమాన్ని ముందుకు సాగించారు.. గ్రామంలోని ప్రజలు జనసేన పార్టీకి మద్దుతుగా నిలిచి, వంగ లక్ష్మణ్ గౌడ్ ను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూల్ నియోజకవర్గ నాయకులు శివ, రాకేష్, రాజు నాయక్, వంశీ రెడ్డి, సూర్య, లింగం నాయక్, పవన్, తదితరులు పాల్గొన్నారు.